ప్రస్తుతం మనుషులు జీవిస్తున్నారని చెప్పుకుంటున్న ఈ సమాజం ఒక భయంకరమైన అడవి కంటే దారుణం.ఇక్కడ మనుషుల రూపంలో కౄరమైన మృగాలు సంచరిస్తున్నాయి.
రాతిపలకలుగా మారిన హృదాయాలు రాబందుల్లా మారిపోయాయి.
అందుకే ప్రతి అడుగులో ఆలోచన ఉండాలంటారు.
ప్రతి క్షణం జాగ్రత్త పడాలంటారు.ఇకపోతే ఎవరినైతే నమ్ముతామో వారే కీడు తలపెట్టేదాక తెలియదు.
కాగా హైదరాబాద్లోని పంజాగుట్ట, డీఎస్ మక్తాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.
ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా, ఆ ఇంటిలో ఒక అమ్మాయి(23) ఒంటరిగా ఉంది.అయితే ఈ విషయాన్ని గమనించిన కామాంధులు ఇద్దరు నిన్న సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి, తాము బ్యాంకు ఉద్యోగులమని తమ బ్యాంకు నుంచి ఫైనాన్స్ ఇస్తామని యువతితో మాటలు కలిపారట.
నిజమని నమ్మిన ఆ అమాయకురాలు వారిని ఇంట్లో కూర్చో బెట్టి మాట్లాడుతుండగా వారిలో ఓ వ్యక్తి ఇంటి బయటకు వెళ్లి కాపలా ఉన్నాడట.ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ యువతి పై అత్యాచారానికి ఒడిగట్టాడట.
ఈ ఘటన అనంతరం జరిగిన దారుణం పై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలనిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా నిందితులను గుర్తించడానికి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారట.
చూశారా ఒంటరిగా ఉన్న మహిళలు ఈ కాలంలో ఎవరిని నమ్మకండి.