మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు.అందులో కొందరు మాత్రమే స్టార్స్ అవుతున్నారు.
మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్స్ మేనళ్లుడు అయిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్ల ను దక్కించుకుని ఎంట్రీ సినిమా తోనే పలు రికార్డు లను తన ఖాతాలో వేసుకున్న గొప్ప నటుడు అన్నట్లుగా పేరును దక్కించుకున్నాడు.మెగా ఇమేజ్ ను పక్కన పెట్టి వైష్ణవ్ తేజ్ సినిమా లు చేస్తున్నాడు.
మొదటి సినిమా లో యాంటీ క్లైమాక్స్ కు ఓకే చెప్పడం ద్వారా మెగా ఇమేజ్ ను పక్కన పెట్టేశాడు.ఇక రెండవ సినిమా ను కొండ పొలంలో గొర్లను కాసే కుర్రాడి పాత్రలో కనిపించడం ద్వారా నటుడిగా మరింత స్థాయికి ఎదిగాడు.
ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే సినిమా ను చేస్తున్నాడు.
ఆ సినిమా పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అవుతున్న సమయంలో మరో సినిమా కు వైష్ణవ్ తేజ్ సిద్దం అయ్యాడు.ఈ సినిమా తో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.మరో వైపు ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ మరియు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే మరోసారి మాస్ ఆడియన్స్ ను అలరించబోతున్నాడు.అంతే కాకుండా గతంలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ చేసినట్లుగా ఇమేజ్ పక్కన పెట్టి చాలా సింపుల్ పాత్ర లో కనిపించబోతున్నాడు.
ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో ఇలా సింపుల్ పాత్రలు చేయడం మామూలు విషయం కాదు.గతంలో చిరంజీవి ఆ పాత్రలు చేశాడు అంటే స్టార్ డమ్ లేదు.
పవన్ సింప్లిసిటీ కనుక చేశాడు.కాని వైష్ణవ్ తేజ్ చేయడం గొప్ప విషయం అన్నట్లుగా మెగా అభిమానులు కితాబిస్తున్నారు.