తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొండ పొలం అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రంలో హీరోగా ఉప్పెన మూవీ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ నటించగా హీరోయిన్ గా గా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన అలాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సాయి చంద్, హేమ, మహేష్ విట్టా, ఆంటోని, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా దర్శకుడు ఈ చిత్రాన్ని గొర్రెలు కాసుకునేటువంటి కుటుంభం నుంచి ప్రభుత్వ సంపాదించిన యువకుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెకెక్కించాడని తెలిపాడు.అంతేకాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ముందు తన మొదటి చిత్ర షూటింగ్ పూర్తి కాకపోయినప్పటికీ ఉప్పెన చిత్రంలోని “నీ కన్ను నీలి సముద్రం” అనే పాటని చూసి మరియు తన నటనా ప్రతిభను నమ్మి తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కి థాంక్స్ తెలియజేశాడు.
అయితే ఈ చిత్ర కథ గురించి క్రిష్ జాగర్లమూడి తనతో చెప్పినప్పుడు తను కూడా తన మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్ తీసుకున్నానని దాంతో పవన్ కళ్యాణ్ కూడా వెంటనే ఓకే చెప్పాడని తెలిపాడు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సారి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి తన పాత్రకి న్యాయం చేసిందని చెప్పుకొచ్చాడు.
ఇక ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసేందుకు చాలా కష్ట పడ్డారని అంతేకాకుండా సినిమా సెట్లో చాలా సందడి సందడిగా ఉండేదని దాంతో సరదాగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేశామని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రం ఈ నెల 8 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.సెంటిమెంట్ మరియు ఫ్యామిలీ ఓరియంటెడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.అయితే మొదటి చిత్రంతోనే పంజా “వైష్ణవ్ తేజ్” తన తన సత్తా ఏమిటో నిరూపించుకున్న బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు.
దాంతో కొండ పోలం చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది.