సోషల్ మీడియా ప్రభంజనం పుణ్యమాని చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తోంది.ముఖ్యంగా ఫుడ్ కి సంబంధించిన కొన్ని వీడియోలు మతిపోగొడుతున్నాయి.
తాగే టీలో చికెన్ వేసుకొని తినడం, టీలో ఇడ్లీ ముంచుకొని ఆరగించడం, పిజ్జాలను గులాబ్ జామున్ లతో లాగించడం, ఓరియో పకోడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింత వంటకాలు ఇప్పటికే సంచలనం సృష్టించాయి.తాజాగా ఈ కోవకి చెందిన ఒక వంటకం ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వీడియోలో ఒక ఫుడ్ బ్లాగర్ పానీపూరీతో గోల్గప్ప శాండ్విచ్ అనే ఓ వెరైటీ వంటకం చేసింది.ఈ వీడియో చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు.
ఇదేమి వంటకం బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు.
వైరల్ అయిన వీడియోలో మనం ఒక యువతి పానీపూరీ, శాండ్విచ్ బ్రెడ్ ప్యాకెట్స్ పట్టుకొని ఇవి రెండూ కలిపి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి అని చెప్పడం చూడొచ్చు.
తర్వాత ఈమె శాండ్విచ్ పై పచ్చి మిరపకాయ పచ్చడి బాగా దట్టించి, దానిపై నాలుగు పచ్చి టమాటా ముక్కలు, నాలుగు ఉల్లిపాయ ముక్కలు పేర్చింది.తర్వాత మరొక బ్రెడ్ పీస్ పెట్టి దానిపై మాష్డ్ పొటాటో పేస్ట్ యాడ్ చేసింది.
తర్వాత రెండు పానీపూరీలు నలిపేసి వాటిని ఆలుగడ్డ పేస్ట్ పై కుక్కింది.అనంతరం దానిపై మరొక బ్రెడ్ పెట్టి దాన్ని ఆరగించింది.
అయితే ఈ వెరైటీ వంటకాన్ని తింటుంటే ఆమె నోటి నుంచి పచ్చి టమాటా ముక్క బయటకు వేలాడుతూ చాలా వెగటుగా అనిపించింది.
ఈ పిచ్చి వంటకాన్ని ఆమె తినలేక ఇబ్బంది పడి పోయింది.పచ్చి మిర్చి చట్నీ ఎక్కువ అయిందేమో ఆ స్పైసీ రుచి తట్టుకోలేక ఆమె అల్లాడిపోయింది.ఈ సమయంలో ఆమె వికృతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.
ఆ తర్వాత కూడా ఇది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అంటూ ఆమె సూచించడం కొసమెరుపు.
అయితే సదరు ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోని @sooosaute అనే తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.
దీనికి దాదాపు లక్ష వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఇదేం పిచ్చి వంటకం.ఇలాంటివి సజెస్ట్ చేయకండి అంటూ కొందరు యువతులు మండిపడుతున్నారు.‘ఛీ, నువ్వు చాలా గలీజ్ పిల్లవి’ అని మరికొందరు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.మీరూ ఈ వీడియోపై ఒక లుక్కేయండి.