పానీపూరీ అంటే ఇప్పటి యూత్ కి బాగా క్రేజ్ అని చెప్పుకోవాలి.ముఖ్యంగా అమ్మాయిలు వాటిని ఎందుకో మరి, లొట్టలేసుకుని మరీ తింటారు.
అలా సరదాగా బయటకు వెళ్లినప్పుడల్లా వారు ఆరగిస్తూ వుంటారు.వారిలో స్టూడెంట్స్ ఎక్కువమంది వుంటారు.
ఈ వ్యాపారం చేసే చిరు వ్యాపారాలు కూడా కాలేజీ, స్కూల్స్ వున్నచోట బల్లను పెడుతూ వుంటారు.దాంతో తోపుడు బండి మీద అమ్మే పానీపూరీకి మనదగ్గర మంచి గిరాకీ ఉంటుంది.
ఐతే ఈ సీజన్లో పానీపూరీ తినడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవును, పానీపూరి తినడం వలన ఇటీవల టైఫాయిడ్, మలేరియా వంటి రోగాలు ఎక్కువగా ప్రబలుతున్నాయని అంటున్నారు.
ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.ఈ సీజన్లో ప్రజలు పానీపూరీ తినకపోవడమే మంచిదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తాజాగా ఓ మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది.
టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులు.టైఫాయిడ్కి మరోపేరు పానీపూరీ డిసీస్ అని కూడా చెప్పుకోవచ్చు అని ఆయన చమత్కరించారు.
పానీపూరీ నిర్వాహకులు ముఖ్యంగా శుచి శుభ్రత అనేది పాటించాలి.ఇందులో ఎక్కువగా కాచివడపోసిన నీటినే వినియోగించాలి.ముఖ్యంగా దోమలు, ఈగలు లేకుండా చూడాలి అని వ్యాపారులకు సూచించారు.పది పదిహేను రూపాయల పానీపూరీతో అనారోగ్య సమస్య వల్ల రూ.5వేలు ఖర్చవచ్చు… కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని శ్రీనివాస్ పేర్కొన్నారు.టైఫాయిడ్ను గోల్గప్పా డిసీజ్ అని కూడా పిలుస్తారు.
ఈ వ్యాధి సాల్మొనెల్లా టైఫి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది.