ఇండియాలో అయినా మరెక్కడైనా హెల్తీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్ ను ఎక్కువగా జనాలు ఇష్టపడి తింటారు.హెల్తీ ఫుడ్ రుచిగా ఉండదు.
కాని పలు ఉపయోగాలు ఉంటాయి.కాని జంక్ ఫుడ్ రుచిగా ఉంటుంది.
కాని అనారోగ్య కారకాలు కలిగి ఉంటాయి.అయినా కూడా ప్రతి చోట జంక్ ఫుడ్స్ను తింటూనే ఉంటారు.
ఇండియాలో అత్యధికంగా టైంపాస్కు తినే ఫుడ్ పానీ పూరి.ఎంతో మందికి పానీ పూరి అంటే ఇష్టం.
కాని కొందరు పానీపూరి తయారు చేసే విధానం, గతంలో కొన్ని సందర్బాల్లో వచ్చిన వార్తలను చూసి తినాలంటే భయపడుతున్నారు.
అత్యంత అపరిశుబ్రమైన పదార్థాంగా పానీ పూరికి గుర్తింపు ఉంది.అందుకే ఇష్టమైనా కూడా పానీపూరిని తినరు.పానీపూరిని ముఖ్యంగా వాటర్లో చేయి పెట్టి అతడు ఇస్తూ ఉంటాడు.
ఆ వాటర్తోనే టేస్ట్ వస్తుంది.కాని ఆ వాటర్ ఎలా తయారు చేశాడో, అతడి చేతికి ఏం ఉందో అనే ఒకింత అసహ్యం అనిపిస్తుంది.
ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు.పానీ పూరికి కొత్త విధానం వచ్చింది.
గుజరాత్లో ప్రారంభం అయిన పానీపూరి మిషన్ పూర్తి స్వచ్చమైన పానీపూరిని వినియోగదారులకు అందిస్తుంది.
ప్రస్తుతం గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ పానీ పూరి మిషన్ ఎలా పని చేస్తుందంటే… పానీపూరి వ్యాపారి పూరిలో ఆలూ లేదా సమోసా పెట్టి ఇస్తాడు.అప్పుడు పక్కనే ఉండే మిషన్ వద్దకు వెళ్లి కావాల్సినంత పానీపూరి వాటర్ను తీసుకుని పూరిలో వేసుకుని తినేయవచ్చు.ఇలా చేయడం వల్ల అపరిశుభ్రతకు చోటే లేదని వినియోగ దారులు అంటున్నారు.
గతంలో 100 మంది తింటే ఇప్పుడు 500 మంది తినేందుకు వస్తున్నారని షాపు యజమాని అంటున్నారు.పానీపూరి ఇష్టం ఉన్నా చాలా మంది అపరిశుభ్రం అంటూ తినేందుకు ఇష్టపడటం లేదు.
ఇప్పుడు ఆ సమస్య తీరిందని వినియోగదారులు అంటున్నారు.ఈ మిషన్ మన వద్దకు ఎప్పుడు వస్తుందో కదా… త్వరలోనే వస్తుంది లేండి…
.