టీ20 ప్రపంచకప్లో సెమీస్లో ఓడిపోయిన టీమిండియా, న్యూజిలాండ్ టీమ్స్ రేపు అంటే నవంబర్ 18న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.అయితే నిన్న ఇరుజట్ల కెప్టెన్లు టీ20 ట్రోఫీతో ఫొటోలకు ఫోజిచ్చారు.
ఈ సమయంలోనే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేసిన ఒక పని పాండ్యాని కడుపుబ్బ నవ్వేలా చేసింది.అసలేం జరిగిందంటే.
ట్రోఫీతో ఫొటోలకు ఫోజిచ్చిన తర్వాత భారత క్రికెట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన షర్టును అడ్జస్ట్ చేసుకునే పనిలో పడ్డాడు.
సరిగ్గా అదే సమయంలో పెద్దగా గాలివీచింది.
ఆపై టేబుల్ కదిలి ట్రోఫీ కిందపడేలాగా అనిపించింది.వెంటనే కేన్ విలియమ్సన్ ఆ ట్రోఫీని చేత పట్టుకున్నాడు.
అనంతరం దానిని బల్లపై పెట్టకుండా దాన్ని చేతుల్లో పట్టుకుని అక్కడినుంచి వెళ్ళిపోతూ ఈ కప్పు నాదేనని అన్నాడు.ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చూసి అక్కడే ఉన్న హార్దిక్ పాండ్యా సహా ఫొటోగ్రాఫర్లు బాగా నవ్వుకున్నారు.టీ20 ప్రపంచకప్ అయిపోయాక ఈ టీ20 సిరీస్ టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది.
విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించనుండగా గప్టిల్, బౌల్ట్ మినహా మిగతా టీమ్ మెంబర్స్ అందరూ బరిలోకి దిగుతున్నారు.మరోవైపు హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత యువ క్రికెటర్లు ఈ మ్యాచ్ ఆడనున్నారు.ఇప్పటికే జట్టు న్యూజిలాండ్లో అడుగుపెట్టింది.
ఈ న్యూజిలాండ్ పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చారు.బంగ్లాదేశ్తో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్లో జట్టుకు మాత్రం రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు.