బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) విన్నర్ గా పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) గెలవాలని కోరుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతుండగా పల్లవి ప్రశాంత్ ను విజేతగా నిలపాలని కొంతమంది పడుతున్న కష్టం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
ఒక అభిమాని పల్లవి ప్రశాంత్ గెలవాలని ఏకంగా 150 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తున్నాడు.పల్లవి ప్రశాంత్ అంటే ఊహించని స్థాయిలో అభిమానం ఉండటం వల్లే ఆ అభిమాని ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది.
డిల్లు చైతన్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ పల్లవి ప్రశాంత్ ను ప్రమోట్ చేస్తుండటం గమనార్హం.పల్లవి ప్రశాంత్ కు కెరీర్ పరంగా భారీ సక్సెస్ లు దక్కుతుండగా క్రేజ్ సైతం అమాంతం పెరుగుతోంది.పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ ( Title winner )గా నిలిస్తే మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే అది సంచలనం అవుతుందని చెప్పవచ్చు.పల్లవి ప్రశాంత్ కు సైతం బిగ్ బాస్ షోలో విజేతగా నిలుస్తాననే నమ్మకం ఉంది.
బిగ్ బాస్ హౌస్ లో 15 వారాల పాటు ఉండటం అంటే సాధారణమైన విషయం కాదు.పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినా కాకపోయినా ప్రేక్షకులలో ప్రత్యేక స్థానాన్ని మాత్రం సొంతం చేసుకున్నారు.రాబోయే రోజుల్లో పల్లవి ప్రశాంత్ తన రేంజ్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.పల్లవి ప్రశాంత్ కు మూవీ ఆఫర్లు సైతం పరిమితంగా వస్తున్నాయని సమాచారం అందుతోంది.
ఇప్పటికే పలువురు దర్శకనిర్మాతలు పల్లవి ప్రశాంత్ సన్నిహితులను సంప్రదించారని తెలుస్తోంది.పల్లవి ప్రశాంత్ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి.
పల్లవి ప్రశాంత్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ( Pallavi prashanth )ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.