దక్షిణ భారతంలో ఉగ్ర దాడులకు పాక్‌ ప్లాన్‌

పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇండియాలో మరోసారి విద్వంసంను సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇంటిలిజెన్స్‌ రిపోర్ట్‌ ద్వారా సమాచారం అందింది.కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న పాకిస్తాన్‌ ఆ విషయాన్ని సాకుగా చూపుతూ ఉగ్ర దాడులను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కేంద్రంకు సమాచారం అందింది.

 Pakplan To Terroratackin Southindia Ap-TeluguStop.com

ఉత్తర భారతంలో కాకుండా ఈసారి దక్షిణ భారతదేశంపై పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దృష్టి పెట్టినట్లుగా కూడా ఆర్మీకి సమాచారం అందింది.ఈ విషయమై దేశ వ్యాప్తంగా హై ఎలర్ట్‌ విధించడం జరిగింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సముద్ర తీరాన భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణంగా పరిశీలించాలని, సముద్ర తీరం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవాలని భద్రత సిబ్బంది నిర్ణయించడం జరిగింది.పాకిస్తాన్‌ ఇటీవల విడుదల చేసిన జైషే మహ్మద్‌ అధిపతి మసూద్‌ అజార్‌ను రహస్యంగా విడుదల చేయడం జరిగింది.

ఆయన ఇటీవలే బయటకు వచ్చి ఇండియాలో దాడులకు మళ్లీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడని, వాడికి పాకిస్తాన్‌ ప్రభుత్వం నుండి సాయం కూడా అందుతుందని అంటున్నారు.పాకిస్తాన్‌కు చెందిన పలువురు యువకులతో పాటు భారీ ఎత్తున కాశ్మీరి యువకులను కూడా ఈ దాడులకు ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

దాంతో దక్షిణ భారతంలో ఎక్కువగా భద్రత పరమైన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube