డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమా జూలై 1 వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈ సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముతూ ప్రముఖ కమెడియన్ అడ్డంగా దొరికి పోయాడు.
కమెడియన్ సప్తగిరి ఈ సినిమా టికెట్ల అమ్ముతూ దొరికిపోగా డైరెక్టర్ మారుతి సప్తగిరికి బాగా చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది.అయితే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ లో భాగమే అని తెలుస్తుంది.
గీతా ఆర్ట్స్ తమ యూట్యూబ్ చానల్లో షేర్ చేసిన ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ చేతికి చిక్కారు.ఈ క్రమంలోనే మారుతి మాట్లాడుతూ ఏంటీ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నావా అని అడగగా అవును అని సమాానమిచ్చాడు.
నేను సినిమాలలోకి రాక ముందు ఇలాగే చిరంజీవి సినిమాలకు బ్లాక్ లో టికెట్లను అమ్ముకునే వాన్ని అని సమాధానం చెప్పారు.ఒక్కో టికెట్ ఎంతకు అమ్ముతున్నావ్ అని అడగ్గా 150 అని సమాధానం చెప్పారు.
టికెట్ కౌంటర్ లో కూడా ఇదే రేట్ కి అమ్ముతున్నారు కదా అని చెప్పగా సప్తగిరి ఒక్కసారిగా షాక్ అయ్యారు.అంటే ఈ సినిమాను తిరిగి పాత రెట్లకే అమ్ముతున్నారా అని అడగగా అవునయ్యా ఈ సినిమా టికెట్ల రేట్లను నాన్ కమర్షియల్ గా అమ్ముతున్నాము అని చెప్పారు.మా పక్కా కమర్షియల్ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల రోజులకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.పాత ధరలకే ఈ సినిమా మీ ముందుకు వస్తుందని డైరెక్టర్ చెప్పారు.
ఈవిధంగా ఈ సినిమా రేట్ల గురించి మారుతి ఇలా అందరికీ అవగాహన కల్పిస్తూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.