భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.జనమంతా తమలోని దేశభక్తిని చాటి జెండా వందనం చేసి అమరవీరులను స్మరించుకుంటారు.
అయితే ఆగస్టు 15ను దేశవ్యాప్తంగా సెలవు దినంగా పరిగణిస్తారనే విషయం తెలిసిందే.కానీ ఓ చోట మాత్రం పనిలో ఉంటూనే తమలోని దేశభక్తిని చాటుకున్నారు కొందరు పక్కా కమర్షియల్ వ్యక్తులు.
ఇంతకీ వారి సంగతేమిటో తెలుసుకుందాం పదండి.
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తూ కావాల్సినంత ఎమోషన్ను కూడా యాడ్ చేస్తూ గ్యారెంటీ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు మారుతి.అయితే ఈ సినిమా షూటింగ్ పంద్రాగస్టు నాడు కూడా విరామం లేకుండా జరుపుకున్నారు చిత్ర యూనిట్.
చిత్ర షూటింగ్ సెట్లోనే జెండా ఆవిష్కరణ చేసి అటుపై సినిమా షూటింగ్ను నిర్వహించారు.ఈ షూటింగ్లో హీరో గోపీచంద్, సీనియర్ నటుడు సత్యరాజ్, హీరోయిన్ రాశి ఖన్నాలతో పాటు ఇతర టెక్నీషియన్లు కూడా ఉన్నారు.
ఏదేమైనా పంద్రాగస్టును సెలవుదినంగా భావించి ఆ రోజు సెలవు తీసుకునే చాలా మందిలా కాకుండా, మారుతి అండ్ టీమ్ తమ దేశభక్తిని చాటుతూనే తమ పని తాము కానిస్తూ వెళ్లారు.ఇక ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం పూర్తవ్వగా త్వరలోనే ఈ సినిమాను ముగించి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మరి ఈ సినిమాతో హీరో గోపీచంద్ పక్కా కమర్షియల్ హిట్ కొడతాడా లేడా అనేది చూడాలి.గోపీచంద్తో మారుతి తొలిసారి కలిసి సినిమా చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్టుతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.