అణ్వాస్త్రాలతో దాడి చేస్తాం ముస్లింలకు మాత్రం ఏం కాకుండా చూసుకుంటాం అంటున్న పాక్ మంత్రి

దేశ విభజన జరిగినప్పటి నుండి తమ ప్రజలలో భారత్ పై విష బీజాలు నాటుతూ అభివృద్ధిని గాలికి వదిలేయడంతో అక్కడి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఉగ్రవాదులుగా మారుతున్నారు.వారిని సరైన మార్గంలో నడిపించే చర్యలు తీసుకోవడం మానేసి వాళ్లకు ఆయుధాలు సమకూర్చి మరీ భారత్ పైకి పంపుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం ఫెయిల్డ్ నేషన్స్ లో ఒకటిగా మిగిలిపోయింది.

 Pakistan Minister Comments On India, Pakisthan, India, Chaina, Isi, Railway Mini-TeluguStop.com

అయినప్పటికీ తమ వైఖరి మార్చుకోకుండా ఇతర దేశాలను వాటి భూములను మింగేయడానికి ప్రయత్నిస్తున్న చైనాతో అంటకాగుతుంది.

భారత్ ఈ సంవత్సరం చివరి లోపల పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో చైనా పాంగ్వాన్ లేక్ వద్ద తిష్టవేసింది.

చైనాను తిప్పి పంపడానికి భారత్ చైనాకు పోటీగా భారీ మోహరింపులను చేస్తుంది.దీంతో ఖంగుతిన్న చైనా పాకిస్తాన్ ని భారత్ పై స్పందించమని ఎగదోస్తుంది.పూర్తిగా చైనా చేత చిక్కిన పాకిస్తాన్ తాజాగా భారత్ పై అనుచిత వ్యాఖ్యాలు చేసింది.పాకిస్తాన్ ఐఎస్ఐ వాయిస్ గా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే పాక్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ ఓ టీవీ ఇంటర్య్యూలో భారత్‌ గనక దాడి చేస్తే అణ్వస్త్రాలతో తాము ప్రతిదాడి చేస్తామని హెచ్చరించాడు.

ఈ దాడిలో ఎక్కడా ముస్లింలపై దెబ్బ పడకుండా చూస్తాం అని ఆయన పేర్కొనడం కొసమెరుపు.ఈ వ్యాఖ్యలు చూసిన విశ్లేషకులు అంతా పాకిస్తాన్ కు అంత సీన్ లేదు వాళ్ళను లైట్ తీసుకోవడం ఉత్తమమని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube