కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది.ఈ సమయంలో ప్రపంచ దేశాలు అన్ని కూడా కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం ఇండియాపై దాడులకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇటీవల ఇండియన్ ఆర్మీ జవాన్లను కల్నల్, మేజర్లను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పాకిస్తాన్ తీరుపై ఇండియా తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ ప్రతి విమర్శలకు దిగాడు.ఇండియా కావాలనే పాకిస్తాన్ విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుందంటూ ఇండియాపై ఇమ్రాన్ ఖాన్ విషయం చిమ్మే ప్రయత్నం చేశాడు.
తాజాగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.దక్షిణ ఆసియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చేస్తున్నది ఇండియా మాత్రమే అన్నాడు.ఇండియా తీరు వల్లే ఉగ్రవాదం పెరిగి పోయిందంటూ హాస్యాస్పద వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ చేశాడు.కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లు పూర్తిగా స్థానికం మాత్రమే అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కశ్మీరియులపై కపట ప్రేమను కనబర్చుతూ పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశాడు.అయితే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అక్కడ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు.