నేషనల్ హీరో అభినందన్ ని పాకిస్తాన్ ప్రభుత్వం జెనీవా ఒప్పందంలో భాగంగా ఇండియాకి అప్పగించింది.ఇక ఇండియా వచ్చిన తర్వాత అభిననదన్ రాకని కొనియాడుతూ సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అందరూ సోషల్ మీడియాలో అతన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ పెట్టారు.
అలాగే అతన్ని హీరోగా అభివర్ణించారు.ఇక ఇండియా వచ్చాక అభినందన్ ని ఢిల్లీలో హాస్పిటల్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఐబీ, ఇంటలిజెన్స్ ఇంటరాగేషన్ కూడా చేసింది.
ఇదిలా వుంటే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభినందన్ ఇండియా వచ్చిన తర్వాత అతన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.అతనికి గ్రాండ్ వెల్ కం చెబుతూనే నీ ధైర్య సాహసాలు, తెగువ ఎందరికి స్ఫూర్తిగా నిలిచింది.
నిజంగా నువ్వు ఇండియా గర్వించదగ్గ రియల్ హీరో అని పెట్టింది.అయితే సానియా మీర్జా కామెంట్స్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.నిజానికి సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకుంది.దీంతో ఇండియా – పాకిస్తాన్ మధ్య ఈ సంఘటన జరిగిన సానియా మీర్జా మీద నెటిజన్లు విరుచుకుపడుతూ వుంటారు.
ఇప్పుడు అభినందన్ ని పొగుడుతూ పోస్ట్ చేయడంతో పాకిస్తానీలకి కోపం వచ్చింది.పాకిస్తాన్ గొప్పతనం చెప్పకుండా అభినందన్ ని ఎలా పొగుడుతావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.