ఇండియన్ సినిమాలో శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్ ల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.వాళ్ళు తమ జీవిత కాలంలో బెస్ట్ యాక్టర్స్ గా తమదైన ముద్ర వేసి ఒక్కొక్కరు ఒక్కో కారణంతో చనిపోయారు.
భౌతికంగా వారు ఈ ప్రపంచానికి దూరం అయిన సినీ అభిమానులు ఎప్పటికి వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు.అయితే ఎప్పుడు కూడా ఇండియా మీద ఏదో ఒక విధంగా ఏడ్చే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ చావుల విషయంలో కూడా అవమానకరంగా మాట్లాడారు.
ఈ లెజెండరీ యాక్టర్స్ గురించి ఓ పాకిస్థాన్ యాంకర్ ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడాడు.అమీర్ లియాఖత్ హుస్సేన్ అనే యాంకర్ పాకిస్తాన్ ఛానెల్లో జీవీ పాకిస్థాన్ అనే షో చేసాడు.
అందులో నటుడు అద్నాన్ సిద్ధిఖీ లైవ్కు వచ్చాడు.ఈయన ఇండియన్ సినిమాలలో నటించాడు.
అలాగే హాలీవుడ్లో కూడా నటించాడు.
శ్రీదేవి చివరి చిత్రం మామ్లో అద్నాన్ కూడా నటించాడు.
ఆ తర్వాత ఇర్ఫాన్ ఖాన్తో మైటీ హార్ట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు.నువ్వు మామ్ సినిమాలో శ్రీదేవితో నటించావ్ ఆమె చనిపోయింది.
ఇక ఇర్ఫాన్తో కలిసి నటిస్తే అతడు కూడా చనిపోయాడు అంటూ కుళ్ళు జోకులు వేసాడు.అక్కడితో ఆగకుండా మర్దానీ 2లో రాణి ముఖర్జితో నటించే అవకాశం వదులుకుని ఆమెను, జిస్మ్ 2లో బిపాస బసుతో నటించే అవకాశం వదులుకొని ఆమెను కాపాడావు.
లేదంటే వాళ్లు కూడా చనిపోయేవాళ్లేమో అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.చనిపోయిన వారి గురించి ఇలా అవమానకరంగా మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఇండియన్స్ తో పాటు పాకిస్తాన్ లోని ఇర్ఫాన్ ఖాన్, శ్రీదేవి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.
దీంతో దిగివచ్చిన ఆ యాంకర్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు.