ఆఫ్ఘనిస్థాన్ లో చాలామంది ప్రభుత్వానికి చెందిన అధికారులను చంపుతూ మరోపక్క అనేక జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో భారత రాయబారి కార్యాలయం లో భారత అధికారులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెనక్కి వచ్చేయమని తెలపడం జరిగింది.
మరోపక్క నాటో దళాలు తొలగించడంతో.తాలిబాన్లు.
ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోతున్న అట్ల అంతర్జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తాలిబన్ ఉగ్రవాదులు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటువంటి ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్లు కాదు వాళ్లు కూడా సాధారణ పౌరులే అని తెలిపారు.ఇదే క్రమంలో పాక్ సరిహద్దుల్లో ఉన్న 30 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులకు.
తాము ఆశ్రయం కల్పిస్తున్న ట్లు ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
ఇటువంటి తరుణంలో ఒకపక్క ఆఫ్ఘనిస్థాన్లో దాడులు ప్రతి దాడులు చేస్తున్నా తాలిబాన్లను సమర్థించే రీతిలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేయటం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.