భారతీయ గురుద్వారాపై దాడి.. కాశ్మీర్‌పై రాతలు: యూకేలో పాక్ జాతీయుడు అరెస్ట్

భారతదేశంపై పాకిస్తానీయులు తమ విద్వేషాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నారు.పరాయి దేశంలో ఉన్నా వీరి వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు.

 Pakistan National Arrested For Attack On Uk Gurdwara, Leaving Note On Kashmir,ka-TeluguStop.com

తాజాగా యూకేలో ఓ భారతీయ గురుద్వారాపై దాడికి పాల్పడిన పాకిస్తాన్ జాతీయుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బ్రిటన్ రాజధాని లండన్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెర్బీలోని గురు అర్జన్ దేవ్ గురుద్వారాలో ఓ పాకిస్తానీ విధ్వంసానికి పాల్పడ్డాడు.

అనంతరం అక్కడి నుంచి పారిపోతూ కశ్మీర్ గురించి ఓ లేఖను గోడలపై అంటించి వెళ్లాడు.అందులో ‘‘ కాశ్మీర్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నించండి.లేకపోతే అందరూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని రాసివుంది.గురుద్వారా నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telugu Gurdwara, Kashmir-

పాక్ పౌరుడు దాడి చేసిన సమయం సాధారణ రోజుల్లో కీర్తన ( ప్రార్థన) సమయం.కానీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున గురుద్వారాలో ఎవరూ లేరని స్థానిక అధికారి అన్నారు.కరోనా భయంతో ప్రస్తుతం రోజువారీ కీర్తనలను గురుద్వారా నిర్వాహకులు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.ఓ దుండగుడు మంగళవారం ఉదయం 6 గంటలకు గురుద్వారాలోకి ప్రవేశించి కిటికీలు, అద్దాలు ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.అనంతరం దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube