ప్రపంచ కప్లో వరుసగా రెండు పరాజయాలను నమోదు చేసుకుని అభిమానుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ జట్టు తాజాగా వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకుంది.ఇటీవలే ఒక విజయాన్ని సొంతం చేసుకున్న పాక్ నేడు పసికూన యూఏఈపై ఘన విజయం సాధించింది.
రెండు వరుస విజయాలతో క్వాటర్ ఫైనల్పై ఆశలను సజీవంగా నిలుపుకుంది.పాక్ మరో రెండు మ్యాచ్లు నెగ్గాల్సి ఉంది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.షెజాద్ 93 పరుగులు చేసి పాక్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన యూఏఈ పేలవ ప్రదర్శణతో కేవలం 210 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఓపెనర్లు విఫలం అవ్వడంతో యూఏఈ కేవలం 100 పరుగులు అయినా చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
కాని అనూహ్యంగా టైలాండర్లు రాణించడంతో 210 గౌరవ ప్రధమైన స్కోర్ను సాధించింది.