భారత్ హిందూ రాజ్యం కాకపోయినా ఇక్కడ గొడ్డు మాంసాన్ని, పంది మాంసాన్ని నిషేధించాలని భాజపా, సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తున్నాయి.మరి అసలైన హిందూ రాజ్యానికి గొడ్డు మాంసం వస్తే? భూంకంపంతో అల్లాడిపోతున్న నేపాల్లో ఇదే జరిగింది.ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా పేరు పొందిన నేపాల్కు అన్ని దేశాల మాదిరిగానే పాకిస్తాన్ కూడా సాయం అందించింది.బాధితులకు ఆహారం రూపంలో సాయం చేయాలనుకున్న ఆ ఇస్లాం దేశం ఆహారాన్ని చక్కగా ప్యాక్ చేసి ఆ ప్యాకెట్లను నేపాల్కు పంపింది.
కాని పాక్ పంపిన ఆహారాన్ని ముట్టుకునేందుకు అవకాశం లేదట.ఎందుకంటే …అక్కడికి వచ్చింది గొడ్డు మాంసం.హిందూ రాజ్యమైన నేపాల్లో అక్కడి ప్రభుత్వం గొడ్డు మాంసాన్ని నిషేధించింది.అక్కడ దీన్ని చాలా స్ర్టిక్టుగా అమలు చేస్తున్నారు.
గొడ్డు మాంసం అమ్మితే పన్నెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.ఒక్కోసారి మరణ శిక్ష కూడా విధించవచ్చు.
ఈ దేశంలో ఆవును పవిత్రంగా చూస్తారు.దీంతో గొడ్డు మాంసం ప్యాకెట్లు రావడం పెద్ద చర్చనీయాంశమైపోయింది.
హిందూ రాజ్యమైన ఈ దేశానికి పాక్ ఉద్దేశపూర్వకంగానే గొడ్డు మాంసం పంపిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.నేపాల్కు సాయం చేసేందుకు వెళ్లిన ఇండియన్ డాక్టర్లు పాక్ నుంచి గొడ్డు మాంసం వచ్చిందని కనిపెట్టి అక్కడి అధికారులకు చెప్పారు.
ఈ విషయం ప్రధాన మంత్రికి , ఇంటలిజెన్స్ బ్యూరోకు కూడా చెప్పేసరికి విచారణకు ఆదేశించారు.పాక్లో రోజూ గొడ్డు మాంసం తింటారు కాబట్టి వారు తినే ఆహారాన్నే పంపారు.
మరి ఇక్కడ నిషేధం ఉన్న సంగతి వారికి తెలుసో లేదో…!
.