తమపై మారో సారి దాడికి భారత్ ప్రయత్నం! పాకిస్తాన్ సంచలన ఆరోపణ

ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు పుల్వామా ఉగ్రదాడి, అనంతరం పాకిస్తాన్ లో ఉగ్రస్తావరాలపై వైమానిక దాడి లాంటి ఘటనలు కొంత వరకు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎన్నికలలో భాగా ఉపయోగ పడే అంశాలు.ఈ సంఘటనతో మోడీ పరిపాలన మీద ప్రజలకి విశ్వాసం పెరిగిపోయింది.

 Pakistan Says India Plan To Again Attack On My Country-TeluguStop.com

దాంతో పాటు మిషన్ శక్తి ప్రాజెక్ట్ కూడా మోడీకి భాగా ఉపయోగపడింది.దీంతో విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సైనికుల చర్యలని, అలాగే వారి చావులని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది అని విమర్శలు చేసారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మోడీపై మన ఇండియాలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపనలే పాకిస్తాన్ చేయడం మొదలెట్టింది.తమ దేశంపై భారత్‌ మరోసారి దాడులకు పాల్పడాలని చూస్తోందని ఆరోపించింది.

ఈనెల 16-20 తేదీల మధ్య తమ దేశంపై భారత్‌ దాడులు చేసేందుకు ప్రణాళిక రచిస్తోందని పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది.ఈ ఆరోపణలను భారత్‌ ఖండించింది.

పాక్‌ తన వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడానికి ఉగ్రవాదులను భారత్‌ పైకి ఉసిగొల్పడమే లక్ష్యంగా ఈ ఆరోపణలు చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube