ఇండియా దేశం పై ఎప్పుడూ ఏదో రకంగా దాడి చేయాలని పాకిస్తాన్ సరిహద్దులలో అనేక రకాలుగా వ్యూహాలు వేస్తూ ఉంటది.కవ్వింపు చర్యలు గానీ ఉగ్రవాదుల ద్వారా విధ్వంసాలు సృష్టించడంలో గాని పాకిస్తాన్ ఎప్పుడు తన పాడు బుద్ధిని బయట పెడుతూ ఉంటుంది.
డ్రాగన్ కంట్రీ తో కూడా చేతులు కలిపి ఇండియాని ఏదోరకంగా ఇబ్బందులు పెట్టాలని అనేక చర్యలకు పాల్పడుతోందని చాలామంది చెబుతారు.అలాంటి పాకిస్తాన్ దేశానికి ప్రధాని అయినా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఇండియా టీం పై చేసిన కామెంట్స్ అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది.
మేటర్ లోకి వెళితే ఇండియా టీం ప్రస్తుతం సాధిస్తున్న విజయాలు ప్రపంచంలోనే అన్ని టీం ల కంటే మేటి అనే రీతిలో సాధిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఉన్న ఈ జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నట్లు, ప్రపంచంలోనే తిరుగులేని జట్టుగా ఇండియా ఎదుగుతున్నట్లు పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు.
ఇదే తరుణంలో పాకిస్థాన్ దేశంలో కూడా మంచి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నట్లు, వాళ్లు అత్యుత్తమ ఆటగాళ్లు గా తీర్చిదిద్దడానికి సమయం పడుతున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాకుండా ఖచ్చితంగా పాకిస్తాన్ దేశం కూడా ప్రపంచంలో మేటి క్రికెట్ టీం గా త్వరలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏదిఏమైనా ఎప్పుడూ దాడులు.విమర్శలతో వ్యవహరించే పాకిస్థాన్ ప్రధానులు మొదటిసారి భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించడం అంతర్జాతీయంగా ఈ వార్త సంచలనంగా మారింది.