కరోనా పుణ్యాన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో దేశంలోని ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి.
కరోనా భయంతో జనాలు బయటకు రావడం దాదాపు తగ్గించేశారు.దానితో ఇంట్లోనే ఉండడం టీవీలో, ఓటిటిలో పెద్దగా కొత్త సిరీస్ లు ,సినిమాలు లేకపోవడంతో జనాలు ఎక్కువ టైం సోషల్ మీడియాలో గడుపుతున్నారు.
అందువల్లే అనుకుంటాను సోషల్ మీడియాలో ఈమధ్య ప్రతి చిన్న విషయం అలాగే గతంలో ప్రజల నోటీసు లోకి రాకుండా ఉన్న విషయాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.అందులో భాగంగానే గతంలో పాకిస్తాన్ ఏడడుగుల పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.
2012లో పాకిస్తాన్ కి భారత్ కి మధ్య జరిగిన సిరీస్ మ్యాచ్ లో భారత ఓపెనర్ గౌతం గంభీర్ తన బాల్స్ ను ఎదుర్కోలేక తెగ ఇబ్బంది పడ్డారని ఈ సిరీస్ లో జరిగిన ఐదు మ్యాచ్ లలో గౌతం గంభీర్ తన చేతిలో రెండుసార్లు ఔట్ అయ్యాడని ఈ సిరీస్ వల్లే గౌతం గంభీర్ ఒకరకంగా తన కెరియర్ కు గుడ్ బాయ్ చెప్పవలసి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.