ఇండియాకు చెందిన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కుఠిల ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ఎప్పటికప్పుడు ఇండియా సరైన సమాధానం పాకిస్తాన్కు చెబుతూనే ఉంది.
అయినా కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.ఒక వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో వివాదం నడుస్తుండగా డఖ్ లోని కొంత భాగం మాది అంటూ పాకిస్తాన్ మ్యాప్ విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
పాకిస్తాన్ ఇది ఖచ్చితంగా కవ్వించేందుకు చేస్తుంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పాక్ కొత్త మ్యాప్ విషయంలో ఇండియన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
పాకిస్తాన్ కేబినెట్ ఆమోద ముద్ర పొందిన కొత్త మ్యాప్లో కశ్మీర్లోని కొంత భాగంను కలపడంతో పాటు లద్దాక్ లోని కొంత భాగం కూడా మాదే అంటూ అందులో పేర్కొన్నారు.మ్యాప్ విడుదల సందర్బంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తానీలు ఏం కోరుకుంటున్నారో అది ఈ మ్యాప్లో ఉంది.
పాక్ కేబినెట్ ఆమోదించిన ఈ మ్యాప్ను ప్రపంచం ముందుకు నేడు తీసుకు వస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.పాక్ స్కూల్స్ పాఠ్యాంశాల్లో ఈ మ్యాప్ను మాత్రమే వాడాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గత సంవత్సరం భారత ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ కు ఇది పూర్తి విరుద్దంగా ఉండటంతో కావాలని కయ్యానికి కాలు దువ్వుతున్నారు అంటూ పాక్ పై అంతర్జాతీయ మీడియా సైతం విమర్శలు గుప్పిస్తోంది.