టీమిండియా పై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.తమ జట్టు సెమీస్ కు చేరకుండా అడ్డుకొనే ఉద్దేశ్యం తో శ్రీలంక,బాంగ్లాదేశ్ లతో జరగనున్న మ్యాచ్ లలో టీమిండియా ఓడిపోనున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా ఆఫ్ఘన్,ఆసీస్ జట్ల తో జరిగిన మ్యాచ్ లలో కూడా భారత జట్టు విజయం సాధించడం పై తనదైన శైలి లో ఆరోపణలు చేశారు.కావాలనే ఆఫ్ఘన్ జట్టు పేలవంగా ఆడిందని, అలానే ఆసీస్ ఓపెనర్ వార్నర్ కూడా ఉద్దేశ్యపూర్వకంగా చెత్తగా బ్యాటింగ్ చేసాడు అంటూ విమర్శలు గుప్పించాడు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 లో పాక్ జట్టు సెమి ఫైనల్ కు రాకూడదు అని టీమిండియా కొరుకుటోంది అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు.మరో విశేషం ఏమిటంటే 1992 లో ఐసీసీ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో తమ దేశంలోనే ఆడేందుకు లీగ్ మ్యాచ్ లో పాక్ తో న్యూజిలాండ్ కావాలనే ఓడిపోయింది అంటూ ఆ మ్యాచ్ పైనా విమర్శలు చేశాడు.
1993 నుంచి 1996 వరకు పాకిస్థాన్ జట్టులో ఆడిన బాసిత్ అలీ మ్యాచ్ ఫిక్సింగ్లో ఇరుక్కొని క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కున్న బాసిత్ కు ప్రతి ఒక్కరూ కూడా అలానే మ్యాచ్ ఫిక్సర్లు లాగే కనిపిస్తున్నారు ఏమో మరి.ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టీమిండియా ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.