అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సరి కాదు...

నిన్నటి రోజున అదిరథ మహారథుల సమక్షంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య లో నిర్మిస్తున్న రామ మందిరానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో యావత్ దేశం మరియు ఇతర దేశాలు నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ పనికి మద్దతు తెలుపుతుంటే పాకిస్తాన్ దేశం మాత్రం మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది.

 Pakistan Foreign Office Sensational Comments On Ayodhya Ram Mandir, Pakistan For-TeluguStop.com

ఇందులో భాగంగా ఎన్నో వందల ఏళ్లు చరిత్ర కలిగినటువంటి బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో మసీదుని కూలగొట్టి రామ మందిరాన్ని నిర్మించడం సరికాదంటూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక భారతదేశంలో రాను రాను ముస్లిం సోదరులకు రక్షణ లేకుండా పోతుందని మత కలహాలు సృష్టించే విధంగా విమర్శలు చేసింది.

అలాగే  పూర్వపరాంతరాలు తెలుసుకోకుండా విచారణ జరిపి ఎలా తీర్పు ఇస్తారని అంటూ అక్కసు వెళ్లగక్కింది.

దీంతో ఈ విషయంపై స్పందించినటువంటి కొందరు నెటిజన్లు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయని ఇందులో కుల మతాలకు ఎలాంటి తావు ఉండదని పాకిస్తాన్ చేసినటువంటి విమర్శలకు సమాధానం ఇస్తున్నారు.

అంతేగాక భారత్ భారతదేశపు న్యాయ వ్యవస్థపై తమ ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం  ఉన్నాయని అందువల్లనే అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సబబే అని కోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని ప్రజలందరూ స్వాగతించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube