నిన్నటి రోజున అదిరథ మహారథుల సమక్షంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య లో నిర్మిస్తున్న రామ మందిరానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో యావత్ దేశం మరియు ఇతర దేశాలు నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ పనికి మద్దతు తెలుపుతుంటే పాకిస్తాన్ దేశం మాత్రం మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది.
ఇందులో భాగంగా ఎన్నో వందల ఏళ్లు చరిత్ర కలిగినటువంటి బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో మసీదుని కూలగొట్టి రామ మందిరాన్ని నిర్మించడం సరికాదంటూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక భారతదేశంలో రాను రాను ముస్లిం సోదరులకు రక్షణ లేకుండా పోతుందని మత కలహాలు సృష్టించే విధంగా విమర్శలు చేసింది.
అలాగే పూర్వపరాంతరాలు తెలుసుకోకుండా విచారణ జరిపి ఎలా తీర్పు ఇస్తారని అంటూ అక్కసు వెళ్లగక్కింది.
దీంతో ఈ విషయంపై స్పందించినటువంటి కొందరు నెటిజన్లు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయని ఇందులో కుల మతాలకు ఎలాంటి తావు ఉండదని పాకిస్తాన్ చేసినటువంటి విమర్శలకు సమాధానం ఇస్తున్నారు.
అంతేగాక భారత్ భారతదేశపు న్యాయ వ్యవస్థపై తమ ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అందువల్లనే అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సబబే అని కోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని ప్రజలందరూ స్వాగతించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
.