పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ లో జైషే మహ్మద్ స్థావరాలపై వైమానిక దాడులు చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ దాడుల అనంతరం రెండు దేశాల మధ్య ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది.
అయితే ప్రపంచ దేశాలు కల్పించుకోవడంతో పాటు పాకిస్తాన్ కి నేరుగా హెచ్చరికలు జారీ చేయడంతో ఆ దేశం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.అయిన కవ్వింపు చర్యలు మాత్రం ఆపలేదు.
అయితే భారత ఆర్మీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉంది.ఇదిలా ఉంటే ఉగ్రదాడులకి పాల్పడింది పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులే అని చెబుతున్న ఇండియా సాక్ష్యాలు చూపించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే పుల్వామా దాడి వెనుక ఎవరు ఉన్నారు.సూత్రధారులు ఎవరు, పాకిస్తాన్ లో ఎక్కడ ఉగ్ర స్థావరాలు ఉన్నాయి అనే విషయాలని సాక్ష్యాలతో సహా ఇచ్చింది.
అయితే భారత్ ఇచ్చిన సాక్ష్యాలపై మరోసారి పాకిస్తాన్ తన దొంగ బుద్ధి చూపించింది.భారత్ తమకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఉగ్ర వాద స్థావరాల ఉన్నాయేమో అని చూసాం కాని ఎక్కడా ఉగ్ర స్థావరాల జాడ కనిపించలేదని, అలాగే భారత్ ఆరోపించిన వారిని అదుపులోకి తీసుకొని విచారించామని అయితే వారికి పుల్వామా దాడులతో సంబంధం లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది.
దీంతో పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరి చాటుకుంది అని భారత్ విమర్శలు చేసింది.