అవకాశం దొరికితే భారత్ పై ఆరోపణలు చేయడం లేదంటే భారత్ అన్నిటిలోనూ ఓడిపోవాలి అంటూ పాకిస్థాన్ ఎప్పుడూ కోరుకుంటుంది.అయితే ఇప్పుడు మాత్రం పాక్ అభిమానులు మొత్తం అందరూ కూడా టీమిండియా గెలవాలని కొరుకుంటుందట.
భారత్ అంటేనే మండిపడే పాకిస్తానీయులు జైహింద్,వందేమాతరం అని అనడం ఏంటి అని అనుకుంటున్నారా.దీనికి కారణం లేకపోలేదు.
ఈ నెల 30 న భారత్,ఇంగ్లాండ్ జట్టు తో తలపడనున్న సంగతి తెలిసిందే.అయితే ఆ మ్యాచ్ లో భారత్ గెలవాలని పాక్ అభిమానులు తెగ కోరుకుంటున్నారు.
ఎందుకు ఆ విధంగా కోరుకుంటున్నారు అని ఆలోచిస్తున్నారా.అక్కడే ఉంది అసలు విషయం.
ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే పాకిస్థాన్ జట్టు సెమీస్కు చేరే అవకాశాలుంటాయి.ఒకవేళ ఈ మ్యాచ్లో కోహ్లీ సేన ఓటమి పాలైతే మాత్రం పాక్ సెమీస్ ఆశలు గల్లంతు అయినట్లే.
అందుకే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలని పాక్ క్రికెట్ అభిమానులు తెగ కోరుకుంటున్నారు.ఇక ఈ మ్యాచ్పై సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో మీ మద్దతు ఎవరికి? అంటూ పాక్ క్రికెట్ ఫ్యాన్స్కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ సోషల్ మీడియాలో ద్వారా ఓ ప్రశ్న వదిలారు.అంతే ఇంక ఒకొక్కరు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ ‘జైహింద్’ అని ఒకరు,’వందేమాతరం’ అంటూ మరొకరు తెగ ట్వీట్ చేస్తున్నారు.ఇంకొందరు అయితే `మేం మా పొరుగువారిని చాలా ప్రేమిస్తాం.మేం కచ్చితంగా భారత్కే మద్దతిస్తాం అంటూ ఎవరి అభిప్రాయాలను వారు ట్వీట్ చేస్తున్నారు.మొత్తానికి భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ మాత్రం పాకిస్థానీయులతో జై హింద్, వందేమాతరం అనిపించేస్తుందన్నమాట.