పాకిస్తాన్ ఇండియాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లను ప్రజలు భావోద్వేగాలతో చూస్తారు.
దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది.ఇలాంటి మ్యాచ్లో ఆడాలంటే ఏ క్రికెటర్ కైనా వెన్నులో వణుకు పుడుతుంది.
దాంతో రెండు దేశాల క్రికెటర్స్ చాలా జాగ్రత్తగా మ్యాచ్ ఆడుతూ ఉంటారు.ఇదిలా ఉంటే ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ పైన ఇప్పటివరకు పాకిస్తాన్ కి విజయం దక్కలేదు.
తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ భారత్ పై ఘోరంగా ఓడిపోయింది.భారత్ పైన మ్యాచ్ ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఇప్పటికీ కూడా క్రికెటర్స్ పై విపరీతమైన కోపంతో ఉన్నారు.
సీనియర్ క్రికెటర్ నుంచి క్రికెట్ అభిమానులు వరకు అందరూ కూడా పాకిస్తాన్ క్రికెటర్ లని తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును నిషేధించాలంటూ ఆ దేశానికి చెందిన ఓ అభిమాని నేరుగా కోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
భారత్ పై ఓటమికి పాకిస్థాన్ జట్టుతో పాటు సెలక్షన్ కమిటీ కూడా బాధ్యత వహించాలంటూ అభిమాని పంజాబ్ ప్రావిన్స్ లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.సివిల్ కోర్టు కూడా అ ఆ పిటిషన్ను విచారించిన దానిపై తగిన నివేదిక అందించాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో లో ఈ అంశంపై చర్చించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది.