గత కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే తాజాగా మిడతల రూపంలో రైతులకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి.దీంతో పలువురు రైతులు తమ పంట పొలాలను రక్షించుకునేందుకు గాను తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కానీ పాకిస్తాన్ దేశంలోని రాజస్థాన్ నగరంలో మాత్రం ఏకంగా మిడతలను బిర్యాని వండుకొని తింటూ విస్మయానికి గురి చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే రాజస్థాన్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు హోటళ్ళు మరియు రెస్టారెంట్లలో మడతలను ఏకంగా బిర్యానీ చేసి విక్రయిస్తున్నారు.
అయితే వినియోగదారులు కూడా ఈ బిర్యాని బహు రుచిగా ఉందంటూ తెగ తినేస్తున్నారట.అంతేకాక మరికొన్ని చిరుతిళ్ళు హోటళ్లలో మిడతలను సలసల కాగే నూనెలో వేయించి తినేస్తున్నారట.వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మిడతల మాత్రం పలు రకాల ప్రోటీన్లు మరియు శక్తి పోషకాలు వంటివి బాగా ఉంటాయని అందువల్లనే ప్రజలు వీటిని తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని కొందరు అంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మన దేశంలో మిడతల నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు గాను పలువురు వైద్యనిపుణులు పంట పొలాలపై మట్టిని నీళ్లలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచిస్తున్నారు.
దీనివల్ల మిడతలు మట్టి ఉన్నటువంటి ఆకులు తినడం వల్ల తొందరగా మరణిస్తాయని అంటున్నారు.
మరి కొందరు నెటిజన్లు అయితే మాత్రం అచ్చం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన7థ్ సెన్స్ మరిత్యు బందోబస్తు చిత్రాల్లోని సన్నివేశాల లాగే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తుందని సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు.