ఓ వైపు పాక్ చెర నుంచి అభినందన్ ని భారత్ కి పాకిస్తాన్ ప్రభుత్వం అప్పగించింది.అయితే ఓ వైపు శాంతి ఒప్పందం అంటూ అభినందన్ ని ఇండియాకి అప్పగించిన కూడా మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు వద్ద భారత్ భద్రతా దళాలు లక్ష్యంగా కాల్పులకి పాల్పాడుతుంది.
భారత్ ని ఓ వైపు రెచ్చగొడుతూ, కవ్వింపు చర్యలకి పాల్పడటంపై దేశం యావత్తు చాలా సీరియస్ గా వుంది.ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో అభినందన్ రిలీజ్ అయ్యాడని సంతోషించాలో, పాకిస్తాన్ కాల్పులలో జవాన్లు చనిపోయారని భాధపడాలో తెలియని స్థితి నెలకొని వుంది.
పాకిస్తాన్- భారత్ మధ్య సరిహద్దులో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇండియాకి చెందిన ముగ్గురు సిఆర్పీఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు మరణించినట్లు తెలుస్తుంది.ఓ వైపు కాశ్మీర్ లో ఉగ్రవాదులతో దాడులు చేయిస్తూ, మరో వైపు సరిహద్దు వద్ద కాల్పులకి తెగబడుతూ, ఇంకో వైపు పాకిస్తాన్ శాంతి మంత్రం జమ్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూ వున్నాయి.
అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ సాధించిన నైతిక విజయాన్ని భరించలేక ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడిచే విధంగా ఎదురుకాల్పులకి తెగబడుతుంది అని తెలుస్తుంది.
.