ఆకలి వేస్తే పాము తన గుడ్లను తానే మింగేస్తుందంటారు.ఇలాంటి పనే చేసిందట పాకిస్దాన్.
అసలే ఉగ్రవాదాన్ని వెన్నెతో రంగరించే ఈ దేశంలో బ్రతకాలంటే, బ్రతుకు మీద ఆశ ఉన్న వారు ఆనందంగా జీవించడం చాలా కష్టం.
పాకిస్దాన్లో ప్రస్తుతం ఇదే పరిస్దితి కనిపిస్తుందట.
ఎందుకంటే ఈ దేశంలోని ఆర్మీ సొంత పౌరులపైనే కాల్పులకు తెగబడటం ఎంత కిరాతకమైన చర్య.ఇక పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారట.
ఆ వివరాలు చూస్తే.పాక్ లోని ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని కోహిస్తాన్ జిల్లాలోని దాస్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఇక్కడి స్దానిక ప్రజలు భూములను ఇచ్చారు.
ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిందట.
అలా ఇస్తానన్న నష్టపరిహారం ఎన్నిరోజులకైనా చెల్లించక పోవడంతో భూములు ఇచ్చిన ప్రజలు ఆందోళన చెపట్టారు.
ఈ క్రమంలో దాస్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ దగ్గర నిరసన చేపట్టారట.ఈ నేపధ్యంలో ఆందోళనలు చేస్తున్న స్థానికులపై పాక్ ఆర్మీ కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారట.
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.