పంజాబ్ లోని పాక్ డ్రోన్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి.తాజాగా అమృత్సర్ సెక్టార్లో భారత సరిహద్దు కంచె వద్ద ప్రవేశించిన పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ గుర్తించింది.
ఈ క్రమంలో డ్రోనును స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ దళాలు నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.అయితే భారత్ – పాక్ సరిహద్దు ప్రాంతాలలో తరుచుగా డ్రోన్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే.
డ్రోన్ల సాయంతో భారత్ లోకి అక్రమంగా ఆయుధాలు, నిషేధిత డ్రగ్స్ ను పాక్ మూకలు సరఫరా చేస్తున్నారు.