పవర్స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు త్వరలో కేంద్రం పద్మ భూషన్ అవార్డు ఇచ్చి సత్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈయన గత ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.
ఇక రాష్ట్రంలో కూడా తెలుగు దేశం పార్టీకి మిత్ర పక్షంగా వ్యవహరించి ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేయడం జరిగింది.దాంతో ఆంధ్రప్రదేశ్ నుండి పవన్ కళ్యాణ్కు పద్మ భూషన్ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం సిపార్సు చేయగానే కేంద్రం అందుకు ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అటు తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీలు కూడా పవన్ను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నాయి.
అందుకే ఎవరి తోచిన విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ ఎవరి వైపు ఉంటే వారికే అధికారం సుస్పష్టం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే పవన్ను గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు.మరి పవన్ ఇలాంటి వాటికి లొంగి తన మద్దతును తెలుపుతాడా అనేది చూడాలి.