తెలుగు సినీ నటి రేణుదేశాయ్ మన అందరికీ సుపరిచితమే.ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో పలు వార్తలపై స్పందిస్తూ ఉంటుంది.
అలాగే తన పిల్లలు అకీరానందన్, ఆధ్యకు సంబంధించి ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే తన కూతురు ఆద్యా గురించి చెబుతూ, ఆమె చేసే అల్లరి టాలెంట్ ను అందరికీ తెలియజేస్తూ ఉంటుంది.
ఇటీవల తాజాగా ఆద్య గిటార్ ప్లే చేస్తూ పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా పవర్ స్టార్ అభిమానులు ఈ వీడియో పట్ల పాజిటివ్ గా స్పందించారు.
ఇకపోతే ఆధ్యకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నట్టు తెలుస్తోంది.
రేణుదేశాయ్ కూడా ఎక్కువగా సినీ ఇండస్ట్రీ వారితో సన్నిహితంగా ఉంటారు.ఈమె సునీత, ఉత్తేజ్ ఫ్యామిలీ, అడవి శేషు వంటి వారితోనే సన్నిహితంగా ఉంటుంది.
అలా ఉత్తేజ్ ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్ లకు రేణు దేశాయ్ కూడా వెళుతూ ఉంటుంది.ఇక రేణు దేశాయ్ రెండేళ్లుగా రైతు సినిమా కోసం వేచి చూస్తున్న విషయం అందరికి తెలిసిందే.
కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూనే వచ్చింది.ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.రేణు దేశాయ్ తీయబోయే రైతు సినిమాలో కూతురు ఉత్తేజ్ నటించబోతోంది.ఇదిలా ఉంటే తాజాగా కూతురు ఉత్తేజ్ తన ఫాలోవర్ లతో సోషల్ మీడియాలో చాట్ చేసింది.
ఈ క్రమంలోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టగా, కొందరు ఆద్యకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు.అప్పుడు ఆద్యతో దిగిన ఒక సెల్ఫీ ని షేర్ చేసింది పాట ఉత్తేజ్.
ఆధ్య గురించి మాట్లాడుతూ.అద్భుతమైన ప్రతిభ ఉన్న క్యూట్ లిటిల్ గర్ల్.
క్యూటీ ఐ లవ్ యూ అంటూ పాట ఉత్తేజ్ చెప్పుకొచ్చింది.ఆ పోస్టును రేణు దేశాయ్ కు ట్యాగ్ చేస్తూ, మరొక పోస్ట్ లో నెక్స్ట్ సినిమా రేణుదేశాయ్ ఆంటీతోనే అని పాట ఉత్తేజ్ తెలిపింది.