కరోనా సమయంలో అందిన కాడికి దండుకొని బ్యాచ్ లు తమ తమ దందా ను మొదలు పెట్టేశాయి.భాగ్యనగరం హైదరాబాద్ లో ఆక్సిజన్ సిలెండర్ల ను ఎక్కువ ధరకు అమ్ముకుంటూ రెండు ముఠాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కారణంగా నకిలీ శానిటైజర్లు,మాస్క్ ల దందా తో ప్రజలు అల్లాడిపోతుండగా, ఇప్పుడు తాజాగా ఆక్సిజన్ సిలెండర్ల కు సంబందించిన దందా మొదలైంది.ఈ దందాకు హైదరాబాద్ వేదికగా మారింది.
కరోనా సమయంలో ఆక్సిజన్ ల డిమాండ్ ఎక్కువగా ఉండడం తో ఈ దందా ను మొదలుపెట్టిన కొన్ని ముఠాలు డబ్బులు దండుకొని పనిలో పడ్డాయి.అసలు ధర కంటే కూడా ఎక్కువ ధరకు ఆక్సిజన్ సిలెండర్లను అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు.
అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమింటే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఆక్సిజన్ సిలెండర్ల ను అమ్ముతుండడం గమనార్హం.రెట్టింపు ధరలకు అమ్ముతూ డబ్బులు దండుకోవాలని చూసిన రెండు ముఠాల ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో వారివద్ద నుంచి 34 ఆక్సిజన్ సిలెండర్ల ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఎలాంటి అనుమతులు లేకుండా ఈ దందా ను నిర్వహిస్తున్న రెండు ముఠాల గుట్టురట్టు చేశారు పోలీసులు.
అయితే ఎలాంటి క్వాలిటీ లేకుండా ఈ ఆక్సిజన్ సిలెండర్ల ను రెట్టింపు ధరకు ఒక్కొక్కటి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది.