ఇండియాలో ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మళ్లీ షురూ చేయనుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ముంబాయికి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతులు ఇచ్చింది.
బ్రిటన్ లో ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగంలో ఓ వాలంటీర్ అనారోగ్య సమస్య తలెత్తడంతో ట్రయల్స్ నిర్వహణను నిలిపివేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ కు చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ట్రయల్స్ నిర్వహించడంతో మెరుగైన ఫలితాలు వచ్చేంతవరకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోమని సీరమ్ ఇనిస్టిట్యూడ్ సీఈఓ అదార్ పూనావాలా పేర్కొన్నారు.
బ్రిటన్ లో ఓ స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటై క్లినికల్ ట్రయల్స్ పై విచారణ జరిపింది.దర్యాప్తులో వ్యాక్సిన్ భద్రమేనని పేర్కొనడంతో ప్రయోగాలు మళ్లీ ప్రారంభించుకునేలా మెడిసన్స్ హెల్త్ రెగ్యూలేటరీ అథారిటీకి కమిటీ సిఫారసు చేసింది.
దీంతో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది.భారత్ కు చెందిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయడంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించనుంది.
అయితే క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి స్క్రీనింగ్ సమయంలో అదనపు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి సమాచారాన్ని డీసీజీఐకు అందజేయాలని సంస్థ వెల్లడించింది.