కొంతమందికి మూగజీవాలంటే ప్రాణం.తమ సొంత కుటుంభం సభ్యుల్లా వాటిని చూసుకుంటారు.
వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు.అలాంటిది వాటికీ ఏమైనా అయితే తట్టుకోగలరా .? ఉత్తరప్రదేశ్ లోని ఖేరీ జిల్లాలోని నిఘాసన్ తహసీల్ పరిధిలో ఓ రైతు దగ్గర ఉండే ఎద్దు చనిపోవడంతో… ఆ ఎద్దుకు అంత్యక్రియలు చేశాడు .బతికుండగా ఎద్దు ఎంతో కష్టపడిందని గుర్తించిన ఆ రైతు దానిని అంత్యక్రియలు చేసి రుణం తీర్చుకున్నట్లు తెలిపాడు.బ్యాండ్ మేళాతో ఎద్దు మృతదేహాన్ని ఊరేగించి.తర్వాత సమాధి చేశారు.
అంతేనా … ఆ ఎద్దుకు గ్రామస్తులంతా సంతాపం ప్రకటించారు.అంతిమయాత్రలో గ్రామ ప్రజలంతా పాల్గొని నివాళులర్పించారు.సంతాప దినాలను ఘనంగా నిర్వహించి.1000 మందికి భోజనాలు పెట్టాలని ఎద్దు యజమాని నిర్ణయించాడు.ఎద్దు మృతికి గుర్తుగా స్మారకస్థూపం నిర్మించేందుకు ఇప్పటికే గ్రామస్తులంతా రూ.15 వేలను కలెక్ట్ చేశారు.