ఇంట్లో దొంగతనంకి వెళ్లిన దొంగకి వింత అనుభవం... దీంతో అతను

దొంగతనం చేసుకొని హ్యాపీగా బంగారమో, డబ్బో, అంతకంటే తక్కువలలో తక్కువగా వెండి లేదంటే విలువైన వస్తువులతోనో బయటపడాలని చాలా మంది దొంగలు ఆశపడుతూ ఉంటారు.దానికోసం ఉదయం పూత రెక్కీ పెట్టి మంచి ఇల్లు ఎంచుకొని రాత్రి దొంగతనానికి వెళ్తారు.

 Owner As He Returns Empty-TeluguStop.com

అయితే దొంగతనంకి వెళ్లిన దొంగకి ఇంట్లో తనకి ఉపయోగపడే వస్తువులు ఏమీ దొరకకపోతే వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు.అయితే దొంగల ఫీలింగ్ ఏంటో తెలియజేసే విధంగా తాజాగా జరిగిన ఓ సంఘటన జరిగింది.

ఎన్నో ఆశలతో ఇంట్లోకి చొరబడ్డ ఓ దొంగకి అన్ని గదులూ వెతికిన దోచుకోవడానికి ఏమీ దొరకలేదు.కష్టపడి చేసిన తన ప్రయత్నంఅంతా వృధా అయిపోవడం ఆ ఇంటి యజమానికి ఒక ఘాటు లేఖ రాశాడు.

మధ్యప్రదేశ్‌లోని ఆదర్శనగర్‌లో గల ప్రభుత్వ బంగళాలో ఈ సంఘటన జరిగింది.ఆ ఇంట్లో పర్వేశ్ సోనీ అనే ఇంజనీర్ ఉంటున్నాడు.

ఎంతో కష్టపడి కిటికీలు తొలగించిన దొంగకి ఏమీ దొరకకపోవడంతో, ఉత్తచేతుల్తో తిరిగి వెళ్లాల్సి వచ్చినందుకు దొంగకి విపరీతమైన కోపం వచ్చింది దీంతో ఓ లేఖ ద్వారా తన కోపం మొత్తం కక్కేశాడు.ఓరే నువ్వు చాలా పిసినారివి.

కిటికీలు తొలగించేందుకు నేను చాలా కష్టపడ్డ అదంతా వృథా ప్రయాస అయిపోయింది.ఈ శ్రమకు తగిలన ప్రతిఫలం కూడా లభించలేదు.

ఓ రాత్రి అంతా వేస్ట్ అయిపోయింది అని లేఖ రాసిపెట్టాడు.మరుసటి రోజు పనివారికి లేఖ దొరికింది.

ఈ లేఖ పోలీసుల ద్వారా బయటకి వచ్చి సోషల్ మీడియాకి ఎక్కింది.దీంతో దొంగ కోపాన్ని తెలియజేసే ఆ లెటర్ ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube