నరసరావుపేట ను జిల్లాగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్యే అన్ని రంగాలలో అభివృది చెందిన ప్రాంతం మన పల్నాడు ప్రాంతం.ఎందరో మహానుభావుల పోరాట ప్రతిఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు.
దాస్యపు సంకెళ్ళ నుండి మనం బయటికి వచ్చినపుడు స్వతహాగా మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం.బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన ఫలితమే మన భారత రాజ్యాంగం .
ఎంతో శ్రమించి ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు.ప్రస్తుతం వారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారు.జిల్లా ప్రతిపాదనలు తెరపైకి తిసుకువచ్చి వెంటనే ఆమోదముద్ర వేయించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే దక్కింది.
మన నరసరావుపేట జిల్లా ప్రాంతం కావటం తో మన ప్రాంత అభివృది ఇంకా వేగంగా పరుగులు తీస్తుంది.నేడు మన కల నిజమైన వేళ.విద్య, వైద్య, పారిశ్రామిక అన్ని రంగాలలో మన నరసరావుపేట ముందంజలో ఉంది.