అల్లు అరవింద్ ఇంకా మై హోమ్స్ వారు ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.కరోనా సమయంలో కూడా ఆహాను పట్టించుకున్న నాధుడులు లేరు.
దాంతో ఆహా ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.ఇలాంటి సమయంలో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న రెండు సినిమాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్నాయి.
భానుమతి అండ్ రామకృష్ణ మరియు కృష్ణ అండ్ ఇజ్ లీలా చిత్రాలు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్గా రూపొందిన ఆ రెండు సినిమాలు కూడా మంచి టాక్ దక్కించుకున్నాయి.
ఇప్పటి వరకు ఆ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారట.ఆహాలో అత్యధిక రన్ టైం దక్కించుకున్న సినిమాల జాబితాలో ఈ రెండు సినిమాలు నిలిచాయి.
అలాగే వెబ్ సిరీస్ల పరంగా కూడా ఈ రెండు సినిమాలే టాప్ లో ఉన్నాయని అంటున్నారు.
ఈ రెండు సినిమాల కారణంగా ఆహా సబ్స్క్రైబర్స్ సంఖ్య బాగా పెరిగిందని కూడా టాక్ వినిపిస్తుంది.ఇలాంటి మరికొన్ని సినిమాలను అల్లు అరవింద్ స్ట్రీమింగ్ చేస్తే ఆహా వారు మరింతగా సబ్ స్క్రైబర్స్ను దక్కించుకుంటుందని అంటున్నారు. ఆహా కు ప్రస్తుతానికి నష్టాలే వస్తున్నాయని ముందు ముందు అయినా ఆహా కు లాభాలు వస్తాయనే నమ్మకంతో మెగా వర్గాల వారు ఉన్నారు.
వెబ్ సిరీస్లను రెడీ చేయిస్తున్నాడు.వాటితో కూడా ఆహా ను ఓహో అనే అవకాశం ఉంది.