ఉయ్యాల జంపాల సినిమా తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుసగా చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ లను దక్కించుకున్నాడు.ముఖ్యంగా సినిమా చూపిస్తా మామ సినిమా తర్వాత ఏకంగా ఆయన జూనియర్ రవితేజ అంటూ అభిమానులు చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సక్సెస్ లను రాజ్ తరుణ్ చూశాడు.అయితే గత కొంత కాలంగా ఈయనకు టైం సరిగా ఉన్నట్లుగా అనిపించడంలేదు.
ఎందుకంటే చేసిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ వచ్చింది.చాలా నమ్మకం పెట్టుకొని చేసిన ఒరేయ్ బుజ్జి గా సినిమా థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్టుగా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఒరేయ్ బుజ్జిగా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
థియేటర్లలో అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఈ సినిమాకు రాజ్ తరుణ్ కు పెద్దగా మైలేజ్ వచ్చినట్లుగా అనిపించడం లేదు.
అంటే ఆ సినిమా వల్ల రాజ్ తరుణ్ మరో రెండు మూడు సినిమాలు అయినా అవకాశాలు వస్తాయని భావించారు.కాని ఆయనకు కొత్త ఆఫర్లు ఏమీ లేనట్లుగా తెలుస్తోంది.
అయితే ఒరేయ్ బుజ్జి గా సినిమా ప్రమోషన్ సమయంలో దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు గా రాజ్ తరుణ్ ప్రకటించాడు.అన్నట్లుగానే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతుంది.
వీరిద్దరు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం కథా చర్చలతో బిజీగా ఉన్నారట.
వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న వీరిద్దరు ఈసారి అయినా సక్సెస్ ను దక్కించుకుంటారేమో చూడాలి.