రాజ్ తరుణ్ హీరోగా కొండ విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఒరేయ్ బుజ్జిగా సినిమాను థియేటర్ల ఓపెన్ కోసం ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు.చివరకు ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ఆహా ద్వారా ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు.మాళవిక నాయర్ మరియు హెబ్బా పటేల్ లు హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాలో మాస్ మసాలా ఎలిమెంట్స్ కావాల్సినంతగా ఉంటాయంటూ ట్రైలర్లోనే చూపించారు.
రాజ్ తరుణ్ కు ఈ సినిమా చాలా ఏళ్ల తర్వాత హిట్ ఇవ్వబోతుంది అంటూ సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమా థియేటర్లలో విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని భావించిన యూనిట్ సభ్యులు థియేటర్లు ఎంతకూ ప్రారంభం కాకపోవడంతో చేసేది లేక ఓటీటీ రిలీజ్కు సిద్దం అయ్యారు.
ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాల్సి ఉంది.అంటే తెల్లవారితే అక్టోబర్ 2 అనగా అర్థ రాత్రి సమయంలో స్ట్రీమింగ్ మొదలు పెట్టాల్సి ఉంది.
కాని ఏదో కారణం వల్ల సర్ ప్రైజ్ అంటూ రేపు అంటే ఒక్క రోజు ముందుగానే సినిమాను స్ట్రీమింగ్కు సిద్దం చేస్తున్నారు.ఆహా లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే.
ఇది ఒక మోస్తరు సినిమా అవ్వడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రేపు సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా ప్రసారం కాబోతుంది.
రాజ్ తరుణ్ ఈ సినిమాతో హిట్ కొడితే ఖచ్చితంగా ఆయన కెరీర్ మరి కొంత కాలం కొనసాగుతుంది.నిరాశ మిగిల్చితే మళ్లీ ఆయన కష్టాలు షురూ అవ్వడం ఖాయం.