టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రముఖ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నటువంటి “ఒరేయ్ బుజ్జిగా” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.
అయితే గత కొద్దికాలంగా లాక్ డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు మూసివేశారు.అందువల్ల చిత్ర పరిశ్రమలోని కొన్ని చిత్రాల విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు.అయితే ఈ తాత్కాలికంగా విడుదలను నిలిపి వేసిన చిత్రాల్లో ఉరేయ్ బుజ్జిగా చిత్రం ఒకటి.దీంతో అనుకున్న సమయానికి చిత్ర విడుదలను చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిల దృష్ట్యా అది వీలు కాకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫారంలో విడుదల చేస్తున్నట్లు పలు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
దీంతో తాజాగా ఈ విషయంపై ఈ చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ స్పందించారు.
ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫారం లో విడుదల చేస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ ని గురించి వివరాలు తెలియజేస్తామని తన్మఅధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు.