తెలుగు సినీ నటుడు సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్నాడు.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన సిద్ధార్థ్ ఎన్నో సినిమాల్లో నటించాడు.
ఇక ప్రస్తుతం బిచ్చగాడు ఫేమ్ డైరెక్టర్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒరేయ్ బామ్మర్దిసినిమాలో నటిస్తున్నాడు.అంతేకాకుండా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఒరేయ్ బామ్మర్ది సినిమాలో మరో హీరో జీవి ప్రకాష్ నటిస్తున్నాడు.కాశ్మీర పరదేశి, లిజొ మోల్ జోస్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అభిషేక్ ఫిలింస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.రమేష్ పి పిళ్ళై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు పోటీపోటీగా ఉంటాయి.ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా యాక్షన్ కథతో తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాకు సిద్దు కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గురించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని సినీ బృందం తెలిపారు.
ఇక బిచ్చగాడు డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని అర్థమవుతోంది.
ఇక ఈ సినిమా ఈ నెలలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.మహా సముద్రం సినిమా లో మరో హీరో శర్వానంద్ కూడా నటిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ నటి అదితి రావు హైదరి, అను ఇమాన్యుల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.మొత్తానికి సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాల తోనే కాకుండా తన కాంబినేషన్ తో మరో హీరోలతో రెండు సినిమాలలో చేయడం చెప్పుకోదగిన విషయం.