మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత అటువంటి క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ చరణ్.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా నిలిచి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకుంటున్నాడు.
కెరీర్ మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా మొత్తానికి వాటిని దాటి ఓ రేంజ్ కు ఎదుగుతున్నాడు చరణ్.ఇదిలా ఉంటే చరణ్ కు అప్పట్లో ఓ హీరోయిన్ కు వార్నింగ్ ఇచ్చాడట.
2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రామ్ చరణ్.ఈ సినిమాతో ఉత్తమ నూతన నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు.
ఈ సినిమాలో తన తొలి నటనతోనే తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో గా మారాడు.ఈ సినిమా తర్వాత మగధీర సినిమాలో నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకు కూడా తన నటనకు అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత ఆరెంజ్ సినిమాలో నటించగా ఈ సినిమా చెర్రీని నిరాశ పరిచింది.
ఆ తర్వాత రచ్చ, నాయక్, ఎవడు, ధ్రువ, రంగస్థలం వంటి సినిమాలు తనకు మంచి సక్సెస్ ను ఇచ్చాయి.ఇక తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాలో అతిథి పాత్రల్లో కూడా నటించాడు.
నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
ఇక మంచి హోదాలో ఉన్న సమయం 2012లో ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఉపాసన అపోలో వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టింది.రామ్ చరణ్, ఉపాసన పెళ్లికి ముందే ఐదేళ్లు ప్రేమించుకున్నారు.ఆ తర్వాత తమ విషయం ఇంట్లో చెప్పి కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉపాసన కంటే ముందు మరో హీరోయిన్ కు మనసు ఇచ్చాడు.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.
రామ్ చరణ్ తొలిసారిగా నటించిన చిరుత సినిమాలోని హీరోయిన్ నేహా శర్మ. ఈ సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారితీసింది అని తెలిసింది.
ఇక ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.మెగాస్టార్ చిరంజీవి కొడుకు తొలి సినిమాతోనే హీరోయిన్ ను బుట్టలో వేశాడు అంటూ తెగ కామెంట్స్ వచ్చాయి.
పైగా ఓ సారి నేహా శర్మ కు వార్నింగ్ కూడా ఇచ్చాడట.
గతంలో వీరి మధ్య ప్రేమ ముదిరి పెళ్లి కూడా చేసుకుంటున్నారని బాగా వార్తలు వినిపించాయి.ఆ సమయంలో నేహ శర్మకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చిందట.ఇక ఈ విషయం రామ్ చరణ్ కు తెలియగానే వెంటనే ఆమెను పిలిపించి తమకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడని ఆ తర్వాత ఆమె ఆ సినీ దర్శక నిర్మాతలకు సారీ కూడా చెప్పింది అని తెలిసింది.
కాని ఆమె రామ్ చరణ్ వద్దన్న విషయాన్ని చెప్పకుండా వేరే కారణంతో సినిమా వదులుకుంటున్నానని తెలిపింది.
వీరి మధ్య ప్రేమ నడుస్తుందని మెగా ఇంట్లో కూడా తెలియడంతో ఆ సమయంలో ఎలక్షన్స్ వస్తున్నాయని కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారట.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వీరి మధ్య దూరం పెరిగిందని తెలిసింది.ఆ తర్వాత పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాడని అదే సమయంలో ఉపాసనతో పరిచయం పెరిగిందని తెలిసింది.
ఇదంతా గతంలో జరిగిపోగా ప్రస్తుతం మళ్లీ ఈ విషయం వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇవే కాకుండా శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.వీటితో పాటు మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడని తెలుస్తుంది.