ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల హడావుడిలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ,ఇప్పుడు మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.ఎప్పటి నుంచో టిఆర్ఎస్ అధ్యక్షుడు బాధ్యతలతో పాటు, తెలంగాణ సీఎం పదవి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నా, ఎప్పటికప్పుడు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది.
రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, తదితర కారణాలతో కెసిఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఎప్పటికైనా కేటీఆర్ ను సీఎం కుర్చీలో చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయినట్టు గా కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీ సంస్థాగత ఎన్నికల పై దృష్టిసారించారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న అధ్యక్షుడి ఎంపిక జరగబోతున్న ట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఈ నెల 17 వ తేదీన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు పూర్తి కావడంతో ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఎన్నిక పై దృష్టి సారించారు.
హైదరాబాద్ లోని హెచ్.ఐ.ఐ సీ ప్రాంగణంలో ఈనెల ఐదో తేదీన జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి , అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు.ఈ విషయం స్వయంగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని కేటీఆర్ ప్రకటించారు ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, తరువాత నామినేషన్ల పరిశీలన ఉంటుందని , 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించనున్నారు.ఈ ఎన్నికల్లో కేసీఆర్ నామినేషన్ వేయడంతో పాటు , అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
ఇప్పటికే అనేకసార్లు ఆయన ఈ పదవిని వాయిదా పడుతూ వస్తుండడంతో ఇదే సరైన సమయంగా భావిస్తున్నారని టిఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.టిఆర్ఎస్ కాంగ్రెస్ లు రోజు రోజు కీ బలపడుతూ ఉండడంతో కేటీఆర్ కు ఈ బాధ్యతలు అప్పగించి పూర్తిస్థాయిలో పార్టీపై పట్టు పెరిగేలా చేయడంతో పాటు , తాను తెర వెనుక ఉండి పార్టీ కార్యక్రమాలు పరిరక్షించాలనే ప్లాన్ లో కేసీఆర్ అన్నట్లు సమాచారం.