ప్రముఖ మొబైల్ కంపెనీలూ తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని తెరమీదకు తెస్తున్న విషయం తెలిసిందే.కేవలం మొబైల్స్ విషయంలోనే కాకుండా చార్జర్ హెడ్ ఫోన్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని ప్రవేశ పెడుతూ ఉంటాయి.
ప్రస్తుతం వినియోగదారులను ఆకర్షిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెరమీదకు తెస్తున్న మొబైల్ కంపెనీ ఒప్పో.
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఒప్పో కంపెనీకి ఎంతగానో క్రేజ్ వున్న విషయం తెలిసిందే.
అయితే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో తాజాగా మరో సరికొత్త టెక్నాలజీని తెరమీదికి తెచ్చింది.నూతన సాంకేతికతతో 125 వాట్స్ ఛార్జర్ ను త్వరలోనే ఒప్పో.
స్మార్ట్ఫోన్లతో పాటు వినియోగదారులకు అందించినట్లు తెలుస్తోంది.ఒప్పో రెనో ఫైవ్, ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరరీస్ లతో వినియోగదారులకు ఈ ఛార్జర్ ను అందించింది
అయితే ఈ చార్జర్ గురించి ఒప్పో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన మొబైల్ ను కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఈ చార్జర్ తో ఫుల్ ఛార్జ్ చేసే అవకాశం ఉందట.
కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే జీరో నుంచి 41 శాతం వరకు చార్జింగ్ చేయగలగలదట ఈ ఛార్జర్.ప్రస్తుతం ఒపోలీసు తీసుకొస్తున్న ఈ కొత్త చార్జర్ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.