భారతదేశం నుంచి అత్యధికంగా ఒలింపిక్స్ క్రీడలు ఆడిన వ్యక్తిగా ఎవరైనా ఉన్నారు అంటే అందరూ చెప్పే సమాధానం ఒకటే భారత దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ పేరు మాత్రమే.రాబోయే ఒలంపిక్స్ లో కూడా ఆడి వరుసగా 8 ఒలంపిక్స్ లో ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ఆయన స్పష్టం చేశారు.
వచ్చే సంవత్సరం జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరగబోయే ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు తాను తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కరోనా మహమ్మారి బారిన పడతారని ఎవరు అనుకోలేకపోయామని.
కాకపోతే, సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత కూడా తాను నా లక్ష్యంపై స్పష్టత ఉండాలని.శారీరకంగా, మానసికంగా ఒలింపిక్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశాడు.
తాను భారతదేశం తరఫున చరిత్రపుటల్లో తనపేరు లెక్కించేందుకు 30 ఏళ్ల నుంచి ఆడుతున్నట్లు తెలిపాడు.ప్రస్తుతం తనకి 48 సంవత్సరాలు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని, తాను కొట్టే బంతికి నా వయసు తెలియదని చెప్పుకొచ్చాడు.బాల్ అనేది తాను ఎంత బలంగా, ఎంత వేగంగా బాదుతున్నారు అన్న అంశంపై మాత్రమే కదులుతుందని చెప్పుకొచ్చాడు
ఇందులో భాగంగానే తాను ఒలంపిక్స్ ఆడేందుకు తనకు ఎంతో ప్రేరణ ఉందని, 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే విశ్వ క్రీడా అయిన ఒలంపిక్స్ లో అత్యధిక సంవత్సరాలు టెన్నిస్ ఆడిన వ్యక్తిగా భారత్ పేరిట తన పేరు తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు.ఇక ఇందుకు సంబంధించి టోక్యో ఒలంపిక్స్ ద్వారా ఆ కల నెరవేర్చుకోబోతున్నట్లు ఆయన తెలిపాడు.ఇకపోతే తాజాగా ఆయన ” వన్ లాస్ట్ రోర్” అనే టోర్నీలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగానే తాజాగా ఈ-సైకిల్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సైకిల్ నడిపించే ప్రయత్నంలో కాస్త ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు.
ఆ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.