క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయ్యింది.
సమంత అద్భుతమైన స్టెప్పులకు సింగర్ ఇంద్రావతి చౌహన్ హస్కీ వాయిస్ ఈ పాటకు హైలెట్ అయ్యాయని చెప్పాలి.ఈ విధంగా పుష్ప సినిమాలోని స్సెషల్ సాంగ్ ఊ అంటావా.
మావ ఊఊ అంటావా పాట పాడిన సింగర్కు ఇంద్రావతి చౌహాన్కు అరుదైన గౌరవం దక్కింది.
ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ బిహైండ్వుడ్ సంస్థ ఈ ఏడాదితో 19 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో యానివర్సరీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ క్రమంలోనే మే 22వ తేదీ అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తమ నటులు, సింగర్స్, సినిమాలకు గోల్డ్ మెడల్స్ బహుకరించనుంది.ఈ క్రమంలోనే ఇంద్రావతి చౌహాన్ కూడా ఊ అంటావా.మావ ఊఊ అంటావా పాటకుగాను గోల్డ్ మెడల్ అందుకోనుంది.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఇంద్రావతి సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.నేను నిజంగానే ఆశీర్వదించబడ్డాను మే 22వ తేదీ నేను పాడిన ఊ అంటావా.మావ ఊఊ అంటావా పాటకు గోల్డ్ మెడల్ అందుకోబోతున్నాను.
బెస్ట్ థింగ్స్ ఎప్పుడూ కూడా ఊహించకుండా వస్తాయి.నా విషయంలో కూడా అలాగే జరిగింది.
నాకు ఇంత గుర్తింపు రావడానికి ప్రధానకారణం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు.ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను థాంక్యూ సార్ అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా ఈమె గోల్డ్ మెడల్ అందుకోబోతున్నారనీ తెలియడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.