భారతీయ రైల్వే.ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్.
ఇంతటి భారీ వ్యవస్థ కలిగిన రైల్వేశాఖ దేశంలో ఒక ఉచిత రైలును నడిపిస్తోంది.ఈ ప్రత్యేక రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దులో నడుస్తుంది.
మీరు భాక్రా నాగల్ డ్యామ్ చూడటానికి వెళితే, ఈ రైలు ప్రయాణాన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ రైలు నాగల్ నుండి భాక్రా డ్యామ్ వరకు నడుస్తుంది.
గత 73 ఏళ్లుగా 25 గ్రామాల ప్రజలు ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.భాగ్రా డ్యామ్ గురించి అందరికీ తెలియజేయడానికే ఈ ఉచిత రైలును నడుపుతున్నారు.
భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ రైలును నిర్వహిస్తుంది.ఈ రైలు డీజిల్ ఇంజిన్తో నడుస్తుంది.
ఈ రైలు నంగల్ నుండి ఉదయం 7:05 గంటలకు బయలుదేరుతుంది.సుమారు 8:20 గంటలకు ఈ రైలు భక్రా నుండి నంగల్కు తిరిగి వస్తుంది.నంగల్ నుండి భాక్రా డ్యామ్ చేరుకోవడానికి రైలు దాదాపు 40 నిమిషాలు పడుతుంది.రైలును ప్రారంభించినప్పుడు అందులో 10 కోచ్లు నడిచేవి, ప్రస్తుతం 3 కోచ్లు మాత్రమే ఉన్నాయి.
ఈ రైలులో ఒక కోచ్ను పర్యాటకులకు, మరొకటి మహిళలకు కేటాయించారు.ఈ రైలులోని అన్ని కోచ్లు చెక్కతో తయారు చేశారు.